SHRI SAI DWARKAMAI SANTHAN

        శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి నాథ్ మహారాజ్ కీ జై

          SHRI SAI DWARKAMAI SANSTHAN TRUST ®

                ఈ ద్వారకామాత గొప్ప దయార్ద్ర హృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి.

సాయి నామం

II ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి II | II ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి II | II ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి II | II ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి II | II ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి II | II ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి II | II ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి II | II ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి II |
॥ శ్రీ సాయిబాబా వారి ఏకాదశ సూత్రాలు ॥
  • మరాఠీ మూలం: శ్రీ మోహినీ రాజ్ పండిత్  ;  తెలుగు సేత: స్వామి అచలానంద సరస్వతి   ;    మొదటి సూత్రము   :  శిరిడీలో అడుగు పెట్టిన తక్షణమే!  తొలగిపోవును భక్తుల సర్వ అపాయాలు!!     ;     రెండవ సూత్రము : నా సమాధి వేదికను ఎక్కిన వెనువెంటనే! హరియించును భక్తుల సర్వ దుఖాలు!!   ;      మూడవ సూత్రము  :  ఈ శరీరాన్ని నేను వదిలి వెళ్ళిపోయినా! వస్తాను పరుగు పరుగున భక్తుల హితం కోసం!!     ;      నాల్గవ సూత్రము :  ప్రాప్తిస్తాయి నా సమాధిలో మీ కోరికలన్నీ కూడా! ఉంచండి నా యందు మీ ధృఢ విశ్వాసం!!     ;     ఐదవ సూత్రము  : నిత్యం జీవించే వుంటాను నేను ఇది పరమ సత్యం! స్వానుభవంతో తెలుసుకోండి ఇదే సత్యమని నిత్యం!!      ;       ఆరవ సూత్రము  : నన్ను శరణ కోరి నిరాశులై మరలిన వారిని! ఒక్కరిని ఒక్కరినైనా ఎవరైనా నాకు చూపండి!!     ;     ఏడవ సూత్రము : ఎవరెవరు నన్ను ఏలా ఏలా భావించి భజిస్తారో! వారి వారికి నేను అలా అలానే ప్రాప్తిస్తాను!!     ;     ఎనిమిదవ సూత్రము :  మీ భారాన్ని నేను వహిస్తాను సర్వధా! ఈ నామాట కానే కాదు ఎప్పుడూ అన్యధా!!    ;     తొమ్మిదవ సూత్రము  :  అందరికీ లభిస్తుంది ఇక్కడ నా సహాయం! ఎవరెవరికి ఏమేమి కావాలోఅవన్నీ దొరుకుతాయి!!      ;      పదవ సూత్రము : కాయా వాచా మనసుతో నాకంకితమైన వారికి!  ఎల్లప్పటికీనేను ఋణపడి వుంటాను!!       ;     పదకొండవ సూత్రము :  నా చరణాల్లో అనన్య భక్తితో అంకితమైన వారు! వారే సుమా ధన్యులు ఇదే నా వచనం!!

సంస్థాన్ ట్రస్ట్ గురించి

శ్రీ సాయిబాబా వారి ఆదేశానుసారం శ్రీ సాయి ద్వారకామాయి సంస్థాన్ ట్రస్ట్ ను స్థాపించడానికి నిర్ణయం చేయడం జరిగింది.

శ్రీ సాయి ద్వారకామాయి సంస్థాన్ ట్రస్ట్ కాప్షన్ “ఈ ద్వారకామాత గొప్ప దయార్ద్ర హృదయురాలు, ఆమె నిరాడంబర భక్తులకు తల్లి.”

శ్రీ సాయి ద్వారకామాయి సంస్థాన్ ట్రస్ట్ లోగో విశిష్టత : శ్రీ సాయి ద్వారకామాయి సంస్థాన్ ట్రస్ట్ లోగో ఉద్ధేశ్యం శ్రీ సాయి సచ్చరిత గ్రంథములోని 25వ అధ్యాయములో దాము అన్నా గారు ఒకనాడనేకమందితో సాయిబాబా వారి పాదముల వద్ద కూర్చొని యున్నప్పుడు, వారి మనస్సున కలిగిన రెండు సంశయములలో మొదటి సంశయము. శ్రీ సాయిబాబా వారి వద్ద అనేకమంది భక్తులు గుమిగూడుచున్నారు వారందరు సాయిబాబా వారి వలన మేలు పొందెదరా? దీనికి సాయిబాబా వారు యిట్లు జవాబిచ్చెను. “మామిడిచెట్ల వయిపు పూత పూసియున్నప్పుడు చూడుము. పువ్వులన్నియు పండ్లు అయినచో, నెంత మంచి పంట యగును? కాని యట్లు జరుగునా? పువ్వుగానే చాల మట్టుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెలు  రాలిపోవును. కొన్ని మాత్రమే మిగులును. 

           లోగో అర్థము శ్రీ సాయిబాబా వారి చుట్టూ గుంపులు గుంపులు గూమికొని ఉన్న భక్త జనం మామిడి చెట్టుకు నిండుగా పూసిన పువ్వు వలె ఉంటారు. కానీ శ్రీ సాయిబాబా వారిని సరిగా అర్థం చేసుకోక గాలికి చెట్టుకు ఉన్న కొంత పువ్వు, పిందెలు ఎలా రాలిపోతాయో మనకై మనమే వారి పవిత్రమైన పాదాల చెంత నుంచి రాలిపోతున్నాము. అలా జరగకుండా ప్రతి సాయి బంధువు శ్రీ సాయి నాథుల వారిని అర్థం చేసుకొని శ్రద్ధ-సబూరి లతో పవిత్రమైన వారి పాదాలను పూర్తిగా నమ్మి మామిడి చెట్టుకు మామిడి కాయ పక్వంకు వచ్చి పండు అయినట్లు శ్రీ సాయిబాబా వారి పవిత్రమైన పాదాల చెంత స్థిరంగా ఉండిపోవాలనే ఉద్దేశ్యం.

సంస్థాన్ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశాలు

  • శ్రీ సాయి ద్వారకామాయి సంస్థాన్ ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం శ్రీ సాయినాథుల వారి పవిత్రమైన పాద స్పర్శ ముద్దాడిన శిరిడీ పుణ్య భూమిలో శ్రీ సాయి నాథుల వారి మీద ఉన్న ప్రేమతో శిరిడీకి వెళ్లాలనుకొనే మన ప్రాంతం వారు కొన్ని రోజులు శిరిడీలో ప్రశాంతంగా గడపాలనుకొనే సాయి బంధువులు మరియు దర్శనము కోసం వెళ్లే సాయి బంధువులకు వీలుగా అక్కడ ఒక వసతి సముదాయం నిర్మించండం కోసం…
  • శ్రీ సాయి నాథుల వారి పవిత్రమైన పాదాలు ముద్దాడిన శిరిడీ పుణ్యభూమికి పోవాలి అనే తపన ఉండి వివిధ కారణాల వలన (ఆర్థిక కారణాల వల్ల, భాష సమస్య వల్ల, తోడు లేని కారణం వలన కానీ, టిక్కెట్లు రిజర్వేషన్లు సమస్య వలన) ఇంతవరకు శిరిడీ పుణ్యక్షేత్రం దర్శించని సాయి బంధువులను శిరిడీ పుణ్యభూమి దర్శించాలనే తపన తీర్చడం కోసం…
  • పరమ పవిత్రమైన మరియు శ్రీ సాయి మరో ప్రతిరూపం అయిన శ్రీ సాయి సచ్చరిత గ్రంథము చదవాలనే తపన ఉండి ఆ సచ్చరితామృతం దొరకని సాయి బంధువులకు సచ్చరితామృతాన్ని అందించడం కోసం…
  • పవిత్రమైన శ్రీ సాయి నామము విలువ తెలిసి నిత్యం శ్రీ సాయి ధ్యాసలో గడపాలనే ఉదేశ్యంతో శ్రీ సాయి నామ లిఖితాలను రాయాలనుకొనే తపన ఉన్న సాయి బంధువులకు శ్రీ సాయి నామ లిఖిత పుస్తకాలను అందించడం కోసం…
  • శ్రీ సాయిబాబా వారు ఆచరణ ద్వారా చూపిన సహాయ కార్యక్రమాలలో మనకు వీలు అయిన కొన్ని సహాయ కార్యక్రమాలు అందించడం కోసం…
    • మనిషి నిత్యా జీవితంలో ప్రమాదాలు జరిగినప్పుడు గాయాలు అయ్యి రక్త స్రావం జరిగిన సందర్భలలో కానీ, గర్భిణీ స్త్రీలు ఆపరేషన్ జరిగే సమయాలలో, చిన్న చిన్న ఆపరేషన్ల సమయంలో రక్తం చాలా అవసరం అవుతుంది అటువంటి సందర్భంలో శ్రీ సాయినాథుల వారి దాయమృతమైన కృప వలన కొంత మంది సాయి బంధువులు రక్తం ఇచ్చి కొంత మందికి అయిన రక్త సహాయం చేయాలనే ప్రయత్నం కోసం…
    • శ్రీ సాయిబాబా వారి ఆదేశానుసారం కొన్ని చిన్న చిన్న సహాయ కార్యక్రమాలు చేయాలనే ప్రయత్నం కోసం…
    • మన అందరం శ్రీ సాయినాథుల వారు చెప్పిన మాటలు తెలుసుకొని వాటిలో కొన్నింటిని అయిన ఆచరణలో పెట్టి వారి పాదమార్గంలో ప్రయాణించాలనే చిన్న ప్రయత్నం కోసం…

            శ్రీ సాయి నాథుల వారి దయామృతం వలన వారు మనకు ప్రసాదించిన శక్తి మేరకు పై కార్యక్రమాలను చేయాలనే ప్రయత్నం కోసం శ్రీ సాయి నాథుల వారి ఆదేశానుసారం ఏర్పాటు చేయబడ్డ ఒక నిస్వార్థ స్వచ్ఛంద సంస్థ.

విరాళాలు

                        శ్రీ సాయి ద్వారకామాయి సంస్థాన్ ట్రస్ట్ ను మొదలుపెట్టడానికి ముఖ్యమైన కారణం శ్రీ సాయినాధుల వారి పవిత్రమైన పాద స్పర్శ ముద్దాడిన శిరిడీ పుణ్యభూమిలో శ్రీ సాయినాధుల వారి మీద ఉన్న ప్రేమతో శిరిడీకి వెళ్లాలనుకునే మన ప్రాంతం వారు కొన్ని రోజులు పాటు ప్రశాంతంగా గడపాలనుకునే సాయి బంధువులకు మరియు దర్శనం కోసం వెళ్లే మన సాయి బంధువులకు శిరిడీలో ఒక వసతి సముదాయం నిర్మించడం కోసం 2023వ సంవత్సరము జూన్ నెల 27వ తేదీన శిరిడీ గ్రామంలో శ్రీ ద్వారకామాయి తల్లి ఒడికి అత్యంత సమీపంలో 500 మీటర్ల దూరంలో ఆర్టీసీ బస్టాండ్ వెనుక  1.5 గుంట (3.75 సెంట్ల) స్థలాన్ని కొంతమంది సాయి బంధువుల అమూల్యమైన మాట, ధన సహాయ సహకారాలతో శ్రీ సాయి ద్వారకామాయి సంస్థాన్ ట్రస్ట్ పేరు మీద కొనుగోలు చేయడం జరిగింది. తరువాత ఆ స్థలాన్ని శ్రీ సాయి ద్వారకామాయి సంస్థాన్ ట్రస్ట్ పేరు మీద ఆన్లైన్ రికార్డులలో కూడా నమోదు చేయడం  జరిగింది. తదనంతరం శ్రీ సాయినాధుల వారి ఆదేశానుసారం 2023వ సంవత్సరం అక్టోబర్ నెల 24వ తేదీన శ్రీ సాయిబాబా వారి పుణ్య తిధి సందర్భంగా శ్రీ సాయిబాబా వారు ప్రసాదించిన స్థలానికి కొంతమంది సాయి బంధువుల సమక్షంలో భూమి పూజ కార్యక్రమం చాల మంచిగా జరిగింది. శ్రీ సాయినాధుల వారు తన పాద స్పర్శ తాకిన శిరిడీ నేలపై మనకు ప్రసాదించిన ఈ స్థలానికి శ్రీ సాయి భూమి అనే పేరును నామకరణం చేయడం జరిగింది. ఈ సాయి భూమిలో వసతి సముదాయం నిర్మించడానికి కావలసి ఉన్న బిల్డింగ్ పర్మిషన్లు కూడా కొన్ని రోజులకు రావడం జరుగుతుంది. తరువాత వసతి గృహం కట్టే పని కూడా ప్రారంభించడం జరుగుతుందని ఆశిస్తున్నాము.

                      మేము ఇలా శిరిడీలో స్థలం తీసుకుంటున్నాము అని కొందరి సాయి బంధువులకు చెప్పగా వారు శ్రీ సాయిబాబా వారి మీద ఉన్న ప్రేమతో ఆ స్థలము డీటెయిల్స్ ఎక్కడ, ఎంత దూరం, ఎంత అమౌంట్ ఇలా ఏ ఒక్క మాట కూడా అడగకుండా మా మీద ఉన్న నమ్మకంతో నిస్వార్థంగా పెద్ద మొత్తంలో ధన సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క సాయి బంధువులకు శ్రీ సాయి ద్వారకామాయి సంస్థాన్ ట్రస్ట్ తరుపున పేరు పేరున హృదయ పూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటున్నాము.

                     ఈ శ్రీ సాయి భూమి అనే స్థలాన్ని మనం కొనుగోలు చేసిన దానికి మనకు ఇంకా కొంత ధనం సమకూరాల్సి ఉంది, కాబట్టి దయచేసి ఈ మహోత్రమైన కార్యక్రమం మంచి కార్యక్రమం అని మీకు అనిపిస్తే మీకు తోచినంత ధన సహాయాన్ని శ్రీ సాయిబాబా వారి మీద ఉన్న ప్రేమతో అందించవలసినదిగా మనస్ఫూర్తిగా శ్రీ సాయి ద్వారకామాయి సంస్థాన్ ట్రస్ట్ తరుపున కోరుకుంటున్నాము. మీరు చేసిన ఈ మేలుకు మనం త్వరలో  శ్రీ సాయి నాథుల వారి పాదాలు ముద్దాడిన శిరిడీ పుణ్యభూమి లో ఒక వసతి సముదాయం నిర్మించుకోబోతున్నాము అని చెప్పటానికి చాలా ఆనందంగా ఉంది.

                    శ్రీ సాయి ద్వారకామాయి సంస్థాన్ ట్రస్ట్ కు మీరు అందించే ఈ ధన సహాయం ఒక్క రూపాయి కూడా వృధా పోదని మొత్తం సద్వినియోగం జరిగి ఒక మంచి పుణ్య కార్యక్రమానికి ఉపయోగపడుతుంది.

                                                                                                                                                                                                                                                                                      ఇట్లు

                                                                                                                                                                                                                                                                 శ్రీ సాయి ద్వారకామాయి సంస్థాన్ ట్రస్ట్.

ప్రత్యక్ష ప్రసారం

శిరిడీ ముఖ్యమైన దర్శనీయమైన ప్రదేశాలు

ఉత్సవాలు

కొత్త విషయాలు

  • శ్రీ సాయి భూమి – ప్రస్తుతానికి 2023వ సంవత్సరం శ్రీ సాయిబాబా వారి పుణ్యతిధి రోజున భూమి పూజ జరిగింది. బిల్డింగ్ అనుమతులు ప్రాసెస్ లో ఉన్నాయి. అనుమతులు వచ్చిన వెంటనే శ్రీ సాయి భూమి వసతి సముదాయం నిర్మాణం ప్రారంభం అవుతుంది. అ నిర్మాణానికి ఆసక్తి ఉన్న సాయి భంధువులు శ్రీ సాయిబాబా వారి మీద ఉన్న ప్రేమతో వారికీ తోచినంత విరాళాన్ని ఇవ్వవలసినదిగా మనవి.
 
 
 
 
 
 
 

జరగబోయే ఉత్సవం

శ్రీ రామ నవమి

 

16/04/2024 నుండి 18/04/2024 వరకు

ప్రారంభరోజు మంగళవారం (మొదటి రోజు – పల్లకి ఉత్సవం)16/04/2024
ముఖ్య రోజు బుధవారం (ముఖ్య మైన రోజు రథ యాత్ర)17/04/2024
చివరి రోజు గురువారం(చివరి రోజు)18/04/2024
    

 

 

రోజు వారి కార్యక్రమాలు

  • ఉదయం 04:45 – ఆలయం ప్రారంభం  
  • ఉదయం 05:00 –  భుపాళి 
  • ఉదయం 05:15 – కాకడ ఆరతి 
  • ఉదయం 05:50 – మంగళ స్నానం 
  • ఉదయం 06:20 – శిరిడీ మాజే పండరి పూర్ ఆరతి  
  • ఉదయం 06:25 – దర్శనము ప్రారంభం 
  • ఉదయం 11:30 – ద్వారకామాయిలో ధుని పూజ 
  • మధ్యాహ్నం 12:00 – మధ్యాహ్న హారతి
  • మధ్యాహ్నం 04:00  – పోతి (బూటి వాడలో ఆధ్యాత్మిక గ్రంథ పఠన
  • సంధ్య సమయం –    ధూప్ ఆరతి / సంధ్యా ఆరతి
  • సాయంత్రం 08:30 – 10:00 సాయిబాబా వారి భజన కార్యక్రమం
  • రాత్రి 10:30 శేజ్ ఆరతి
Scroll to Top
Scroll to Top